నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అల్లోకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆకస్మిక వరదలకు ఆ రాష్ట్రంలోని పలు నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలు విలాయ తాండవం చేస్తున్నాయి. పలు నీటిలో మునిగిపోయి..జనజీవనం స్తంభించిపోయింది. జూన్ 20 నుండి కొనసాగుతున్న వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 310 మంది మరణించారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, గల్లంతై 33 మంది మరణించారు.
అదే విధంగా మేఘావృతాలు, పిడుగులు పడటం, విద్యుత్ షాక్లు ఇతర వాతావరణ కారణాల వల్ల 158 మంది మరణించగా, రోడ్డు ప్రమాదాలలో 152 మంది మరణించారు. SDMA డేటా ప్రకారం, మండి (29), కాంగ్రా (30), చంబా (14), కిన్నౌర్ (14), కులు (13) నుండి వర్షాభావ పరిస్థితులలో అత్యధిక ప్రాణనష్టం సంభవించింది.
మరోవైపు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని వరదల ధాటికి జాతీయా, రాష్ట్ర రోడ్లు కొట్టుకుపోయాయి. మండి, కులు, కాంగ్రా, సిమ్లా జిల్లాల్లోని అనేక ప్రధాన ప్రాంతాలు కొండచరియలు విరిగిపడటం, శిథిలాల కారణంగా ప్రయాణించడానికి వీలు లేకుండా పోయాయి. మండిలోనే జాతీయ రహదారులతో సహా 342 రోడ్లు, కులులో 131 రోడ్లు మూసుకుపోయాయి. కిన్నౌర్లో, NH-05 నిగుల్సరి ట్రాండా వద్ద బ్లాక్ చేయబడింది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,400 కంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్న కులు, మండి, కాంగ్రాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కులు (88 పథకాలు), మండి (62) కాంగ్రా (148) లలో నీటి సరఫరా కూడా దెబ్బతింది. దీని వలన వేలాది మంది నివాసితులకు త్రాగునీరు అందుబాటులో లేదు.
