- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ విఘ్ననాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన గర్భిణి క్యూలైన్లో ప్రసవించింది. ఆ మహిళను రాజస్థాన్కు చెందిన రేష్మగా గుర్తించారు. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
- Advertisement -