- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులకు శుభవార్త. స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పాకిస్థాన్తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్లకు సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ముందు ఈ నిర్ణయం సఫారీ జట్టుకు పెద్ద బలాన్ని చేకూర్చనుంది. కోచ్ శుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ, డి కాక్ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే బలమైన ఆశయాన్ని కలిగి ఉన్నాడని, అతని రాక జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
- Advertisement -