నవతెలంగాణ పాట్నా : నేడు బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కాంగ్రెస్ చర్చింనున్నట్లు తెలుస్తోంది. నేడు బీహార్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సదాఖత్ ఆశ్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించి సమావేశాల్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, కె.సి వేణుగోపాల్, పవన్ ఖేరా, ఛత్తీసగఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ కాంగ్రెస్ ఇంఛార్జీ కృష్ణా అల్లవయ్, కాంగ్రెస్ శాసనసభాపక్షనేత షకీల్ అహ్మద్ఖాన్లతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
CWC: పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES