- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో క్రాంతి యూత్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చండీ హోమం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగు రఘు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ హోమం కార్యక్రమానికి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు బండి యాకన్న, బండి కిరణ్, బొద్దున సందీప్, పెనుగొండ సోమేశ్వర్, చిట్యాల మధు, చిట్యాల రాకేష్, పెండ్లి శోభన్ బాబు. తదితరులున్నారు.
- Advertisement -