- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో … శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాల ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్పోర్టులో అనుమతి లభించడం లేదు. పుణే-హైదరాబాద్, ముంబయి-కోల్కతా విమానాలు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు వైపునకు దారి మళ్లుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
- Advertisement -