- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్లోని శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్టీల్ప్లాంట్లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -