నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీజా రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్- 1 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 509 ర్యాంకు సాధించి మల్టీ జోన్ వన్ లో ఎంపీడీవోగా ఎంపికైనట్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సహకారంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం, మరియు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సౌత్ క్యాంపస్ విద్యార్థి గ్రూప్-1 కు ఎంపిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES