నవతెలంగాణ-హైదరాబాద్: వియత్నాంలో బుల్వోయ్ తుఫాను విరుచుకుపడింది. తఫాను దాటికి ఓ వ్యక్తి మృతి చెందగా, నాలుగురు గల్లంతైయ్యారు. బుల్వోయ్ తుఫాను ప్రభావాన్ని ముందుగానే ఊహించిన వియత్నాం ప్రభుత్వం..ముందస్తుగానే అప్రమత్తమైంది. మధ్య, ఉత్తర వియత్నాం నుండి వేలాది మందిని తరలించారు. అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. తుఫాను ఉత్తర తీరప్రాంత ప్రావిన్స్ హా టిన్హ్లో తీరాన్ని తాకింది. బలహీనపడే ముందు, గాలులు వాయువ్య దిశలో హా టిన్హ్, పొరుగున ఉన్న న్ఘే యాన్ ప్రావిన్స్ , మరింత లోతట్టు ప్రాంతాలకు కదులుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
శుక్రవారం నుండి బువాలోయ్ తుఫాను కారణంగా మధ్య ఫిలిప్పీన్స్లో 20 మంది మరణించినట్లు నివేదించబడింది. వారిలో ఎక్కువ మంది మునిగిపోయారు. చెట్లు కూలిపోయాయి, అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. సుమారు 23,000 కుటుంబాలను 1,400 కంటే ఎక్కువ అత్యవసర ఆశ్రయాలకు తరలించారు.
బువాలోయ్ తుఫాను కారణంగా వియత్నాంలో గంటకు 133 కిలోమీటర్ల (83 మైళ్ళు) వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక మీటర్ (3.2 అడుగులు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని, దీని వలన వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో అత్యవసర చర్యలు తీసుకున్నారు.

