- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 7వ రోజూ నష్టాల్లో ముగిసింది. సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 61.52 పాయింట్లు క్షీణించి 80,364.94 వద్ద, నిఫ్టీ 19.80 పాయింట్లు నష్టపోయి 24,634.90 వద్ద నిలిచాయి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షా సమావేశం నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. మారుతీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోగా, టైటాన్, ఎస్బీఐ లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.76గా ఉంది.
- Advertisement -