Saturday, May 10, 2025
Homeజాతీయంపాక్ కాల్పుల్లో మ‌రో జ‌వాన్ మృతి

పాక్ కాల్పుల్లో మ‌రో జ‌వాన్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు. శ‌నివారం జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్‌ యాదవ్‌ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్… సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.. అయితే, ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహాన్ని తరలించేందుకు ఇండియన్‌ ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌ మురళీనాయక్‌ వీరమరణం పొందగా.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -