- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
విద్యుత్ తగాధంతో గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని గూడూరులో చోటుచేసుకుంది. బుధవారం గొర్రెల కాపరి బెల్లి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామ శివారులో గల గొర్రెలు మేతకు వెళ్లడంతో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద వైరుకు తగిలి 4 గొర్రెలు మృతి చెందాయని బోరున విలపించారు. గొర్రెలు మృతి చెందడంతో 60000 నష్టపోయానని అన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఉద్దేశాక అధికారులను కోరారు.
- Advertisement -