- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దామోదర్ రెడ్డి ఐదు సార్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించి, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.
ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
- Advertisement -