- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల్, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద నీటితో శ్రీశైలం ఇన్ఫ్లో 3,95,563 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 3,46,374 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 10 స్పిల్వే గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత జలాశయం వద్ద 209.15 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
- Advertisement -