నవతెలంగాణ-జన్నారం: ఇటీవల ప్రకటించిన గ్రూపు-I ఫలితాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) పోస్ట్ ను సాధించిన జన్నారం మండల మండల కేంద్రానికి చెందిన నగురు అనిల్ కుమార్ని సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం వారిని వారి స్వగృహం గాంధీనగర్ జన్నారంలో అభినందిస్తూ, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎల్ సుధాకర్, ఎన్ మధుసూదన్,అసిస్టెంట్ ఇంజనీర్, నగురు అజయ్ కుమార్ ఉపాధ్యాయులు నగురు సత్యనారాయణ ఎంబడి సత్తన్న సాదుల నర్సయ్య పోలీస్ కాన్స్టేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే విద్యుత్ అధికారులు నగరు అజయ్ కుమార్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు నగరు అజయ్ కుమార్( సబ్ ఇంజనీర్) లైన్మెన్లు ఆగిడి తిరుపతి, బచ్చల మల్లేష్, కట్టెకోల రాజు, గూడెల్లి సత్యనారాయణ, అల్లం వెంకటేష్, దూస రాము తదితరులు పాల్గొన్నారు.