- Advertisement -
నవతెలంగాణ-తొగుట: గ్యాస్ లికేజితో ఇల్లు తగలబడడం బాధాకరం అని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. గురువారం చందా పూర్ గ్రామంలో గ్యాస్ లికేజితో ఇల్లు తగలబద్ద విషయం తెలు సుకున్న గ్రామ పార్టీ అధ్యక్షులు జనగామ సుభాష్ గౌడ్ తో కలిసి సంఘటనా స్థలం పరిశీలించి బాధి తులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.5వేల ఆర్ధిక సహాయం అందించారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదు కోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారి లో మాజీ సర్పంచ్ నర్సట్టి మల్లేశం, నాయకులు చెంది కుమార్, రవి, ధర్మయ్య, కర్ణాకర్, మహేష్, నరేందర్, స్వామి, చంద స్వామి, నర్సింలు, ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
- Advertisement -