- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) అంత్యక్రియలు శనివారం ముగిశాయి. తుంగతుర్తిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయనను కడసారి చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు అశ్రునయనాల మధ్య మాజీ మంత్రికి వీడ్కోలు పలికారు. దామోదర్రెడ్డి అక్టోబర్1వ తేదీన (బుధవారం) తుదిశ్వాస విడిచారు.
- Advertisement -