- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) అండగా నిలిచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీనియర్ నేత జానారెడ్డి నివాళులర్పించారు. భట్టి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా కాకా చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్మికుల ఉన్నతికి పాటుపడ్డారని, ప్రత్యేక తెలంగాణ కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
- Advertisement -