- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. జీఎస్టీ సవరణల వలన రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆంధ్రాలో పర్యటించనున్న ప్రధాని మోడీ రాష్ట్రాలకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి జరిగిన నష్టపరిహారాన్ని ప్రధానిని కోరాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న వెలుగొండ వంటి నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.
- Advertisement -