- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత కావాలని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. సోమవారం వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా జన్నారం మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయంలో, ఇందన్ పెళ్లి రేంజ్ కార్యాలయం, తాళ్లపేట రేంజ్ కార్యాలయాల్లో అటవీ శాఖ అధికారులచే ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ జంతువులపై ప్రేమ కరుణాదయ కలిగి ఉండాలన్నారు. అడవుల పెంపుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అడవులు సమృద్ధిగా ఉంటేనే అందులో అటవీ జంతువులు సమృద్ధిగా నివసిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ లు శ్రీధర్ చారి, సుష్మారావు, జన్నారం ఇంచార్జ్ ఎఫ్ఆర్ఓ మమత, ఎఫ్ఎస్ఓ లు ఎఫ్బి వోలు అటవీ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -