- Advertisement -
నవతెలంగాణ – తుర్కపల్లి
700 కోట్లతో నిర్వహించనున్న గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేస్తుండడంతో 30 ఏళ్ల ఆలేరు నియోజకవర్గ ప్రజల కల నెరవేరిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందజేయొచ్చని అన్నారు. నేడు నిర్వహించే సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు రావాలని, ఎలాంటి ఆటంకం జరగకుండా పోలీస్ సిబ్బందిని చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -