– నినాదంతో మా ప్రభుత్వం ముందుకు పోతోంది
– మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు ఆర్థిక శాఖ రూ.6,210 కోట్లు చెల్లింపు
– ఆర్టీసీని లాభాల బాట పట్టించాం : మధిర బస్టాండ్ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మధిర
”ఊరికో బస్సు, ఇంటికో దీపం..” నినాదంతో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కాలం నుంచి ఇప్పటి ప్రజాప్రభుత్వ పాలన వరకు రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో రూ.10 కోట్లతో నిర్మించనున్న కొత్త బస్టాండ్ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 10 కొత్త బస్సులను ప్రారంభించారు. ముందుగా బోనకల్ మండలం జానకీపురం సబ్ స్టేషన్లో ఆర్టీఎఫ్ఎంఎస్, ఎఫ్పీఐ వ్యవస్థలను ప్రారంభిం చారు. అనంతరం మధిరలో ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. ఊరికో బస్సు నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, ఇంటికో దీపం పేరుతో ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు విరజిమ్మాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ పదేండ్లు అధకారంలో ఉన్న బీఆర్ఎస్ ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ఆలోచన ఉన్నవారే ప్రజలకు మేలు జరిగే సౌకర్యాలు కల్పిస్తారని, అందుకే రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీఎస్ఆర్టీసీ నిలదొక్కుకొని లాభాల బాట పట్టించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు.
మహిళలను గౌరవించుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించా మన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలకు 186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా రూ.6,250 కోట్లు ఆర్థిక శాఖ ఆర్టీసీకి చెల్లించాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే రూ.6,210 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. బ్యాటరీతో నడిచే 600 బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ సంస్థ భవనాలపై సోలార్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బస్సులు, బస్టాండ్ల ఆధునికీకరణ జరుగుతోందని తెలిపారు. మధిర బస్టాండ్ పరిసరాల్లో నీళ్లు నిలబడుతున్నాయని చెప్పగానే రవాణా శాఖ మంత్రి నివేదిక తెప్పించుకొని ఆర్టీసీ బోర్డులో ప్రవేశపెట్టిరూ.10 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మధిరలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులు జరుగుతు న్నాయని, ఆర్టీసీ డిపో డ్రయినేజీని వాటికి అనుసంధానం చేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతుందని అన్నారు. ఒకవేశ విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెనువెంటనే గుర్తించి మరమ్మతులు చేసేందుకు రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం (టీఆర్ఎఫ్ఎంఎస్), ఫాల్ట్ పాస్ ఏజ్ ఇండికేటర్స్ (ఎఫ్పీఐ) ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. ఆధునిక పరి జ్ఞానాన్ని ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్.. సంస్థల పరిధిలోని డాష్ బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఏర్పడినా గుర్తించే అవకాశం ఈ ఆధునిక వ్యవస్థల ద్వారా వీలవుతుందని తెలిపారు.
ఊరికో బస్సు.. ఇంటికో దీపం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES