Saturday, June 14, 2025
E-PAPER
Homeసినిమానవ్వించే 'మిత్ర మండలి'

నవ్వించే ‘మిత్ర మండలి’

- Advertisement -

బన్నీ వాస్‌ నూతన నిర్మాణ సంస్థ బి.వి.వర్క్స్‌ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌, వైరా ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. కళ్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓరు, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో నిహారిక ఎన్‌.ఎం. తెలుగు తెరకు పరిచయ మవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్‌ దర్శకుడు అనుదీప్‌, నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి’ అని అన్నారు. ‘టీజర్‌ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -