- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖపట్నంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలక భేటీ నిర్వహిస్తున్నారు. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. నిర్మాతలు సి. కల్యాణ్, శ్రవంతి రవికిశోర్, భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. థియేటర్ల నిర్వహణ, సినిమా టికెట్లు, పర్సంటేజీలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
- Advertisement -