Sunday, June 29, 2025
E-PAPER
Homeసినిమాఅలాంటి తల్లిదండ్రులకు ఓ గుణపాఠం

అలాంటి తల్లిదండ్రులకు ఓ గుణపాఠం

- Advertisement -

సందీప్‌ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్‌, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్‌ క్లింటన్‌ దర్శకత్వం వహించిన వెబ్‌ సిరిస్‌ ‘ఏఐఆర్‌: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’. జూలై 3 నుంచి ఈ సిరీస్‌ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహిం చారు. హీరోలు శివాజీ, సుహాస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో శివాజీ మాట్లాడుతూ, ‘చదువు అనేది చాలా అవసరం. ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌.. ఈ టైటిల్‌ వినగానే ఈటీవీలో నైన్టీస్‌కి మించి మరో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్‌ అవుతారు. చదువు అనేది నేచురల్‌గా చదవాలి. కేవలం ర్యాంక్స్‌ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ సిరీస్‌ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి’ అని అన్నారు.

‘ఈటీవీ నుంచి అద్భుతమైన కంటెంట్స్‌ వస్తున్నాయి. ఈ సిరీస్‌ కోసం నేను ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నాను’ అని హీరో సుహాస్‌ చెప్పారు. షో రన్నర్‌ సందీప్‌ రాజ్‌ మాట్లాడుతూ,’జోసెఫ్‌ ఈ కథని అద్భుతంగా చెప్పాడు. ఈ కథ వినగానే ఇందులో భాగమవాలనిపించింది. చాలా అద్భుతమైన జర్నీ ఇది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌ ఇది. ఎమోషనల్‌ అవుతారు. పగలబడినవుతారు. ప్రతి డైలాగ్‌కి కనెక్ట్‌ అవుతారు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడండి’ అని తెలిపారు. ‘నా స్క్రిప్ట్‌ విని, నన్ను బిలీవ్‌ చేసిన సాయి, నితిన్‌, సందీప్‌కి థ్యాంక్స్‌. మీ అందరికీ ట్రైలర్‌ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్‌ కూడా మీరందరూ ఎంజారు చేసేలా ఉంటుంది’ అని డైరెక్టర్‌ జోసెఫ్‌ చెప్పారు. ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయి కష్ణ మాట్లాడుతూ,’ఈ ప్రాజెక్టుకి కాంట్రిబ్యూట్‌ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంకో హిట్‌ కొడతాం. ఇంకో సక్సెస్‌ మీట్‌లో మళ్ళీ మాట్లాడదాం’ అని అన్నారు. ‘ఈ సిరీస్‌ అద్భుతమైన విజయం సాధించబోతుంది. జోసెఫ్‌ ఈ ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దాడు. తనకి చాలా మంచి ఫ్యూచర్‌ ఉంటుంది’ అని ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -