‘అర్ధనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి భిన్న సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియెన్స్కి మరింత దగ్గరయ్యారు. ఆయన హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని ఎస్.ఎస్.మీడియా సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాత. డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ,’శివ నాకు ఈ కథ చెప్పినప్పుడు అతను హీరో ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి నాకు పూరి స్టైల్లో అనిపించేవి. అందుకే చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత శివ ప్రసాద్ కూడా శివ విజన్కి సహకరించడం వల్లే అవుట్ఫుట్ బాగా వచ్చింది’ అని తెలిపారు.
‘నిర్మాత శివ ప్రసాద్ వల్లే ఈ ప్రాజెక్టుని సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. హీరో అర్జున్ కటౌట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్. యాక్షన్ సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో తన బెస్ట్ ఇచ్చాడు. జెన్నీ పాత్ర కూడా గుర్తుండిపోతుంది’ అని దర్శకుడు నాగ శివ చెప్పారు.
నిర్మాత శివ ప్రసాద్ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ నాగ శివ కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో చేసిన సినిమానే ఇది. కచ్చితంగా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి కలిగించే సినిమా అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అని అన్నారు.
సరికొత్త అనుభూతినిచ్చే ‘పరమపద సోపానం’
- Advertisement -
- Advertisement -