‘రేవు’ వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్టైన్ మెంట్స్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘వైల్డ్ బ్రీత్’ను నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వత నేని రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శివాజీ రాజా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు టి. రామసత్య నారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు.
పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ వేడుక సందడిగా జరిగింది. శివాజీ రాజా మాట్లాడుతూ,’ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. అలాగే దర్శకుడు హరినాథ్ పులి మంచి పేరు తెచ్చుకోవాలి. స్టార్స్ అవసరం లేదు. స్టార్స్ వెంట పడటం కాదు. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు’ అని అన్నారు. ‘నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా నిర్మాత డా. మురళి గింజుపల్లి నన్ను నమ్మి అంతా నాకు అప్పగించారు. అంతే నమ్మకంగా అయనకు మంచి పేరు వచ్చే సినిమా ఆయనకు ఇస్తాను. నిన్న సీఎం చంద్రబాబుని కలిశాను. ఆయనకు మా మూవీ గురించి వివరించాను. త్వరలోనే అపాయింట్ మెంట్ ఇచ్చి పిలుస్తాను అన్నారు. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్తడే చెప్పారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. శివాజీ రాజా, ప్రసన్నగారు, రామసత్యనారాయణ ఎప్పుడూ సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటారు. జర్నలిస్ట్ ప్రభు అన్ని విషయాల్లో సహకారం మరవలేనిది. ఈ సినిమా షూటింగ్తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంటోంది. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుంటాడు’ అని నిర్మాత పర్వతనేని రాంబాబు అన్నారు. దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ,’నాకు ఈ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ డా.మురళీ చంద్ గింజుపల్లి, పర్వతనేని రాంబాబుకి థ్యాంక్స్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ తుది దశలో ఉంది’ అని తెలిపారు.
సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES