– తాజాగా మరోసారి వినతి పత్రం సమర్పించండి : కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లో హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ భూమి నెంబరు మార్పు చేసి అక్రమంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణా లు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారుల కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింద న్నారు. ఈ పిల్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. వినతి పత్రంలో సర్వే నెంబర్ వివరాలు లేకుండా ఇస్తే ఎలాగని ఎమ్మెల్యేలను ప్రశ్నించింది. ఫలానా ప్రభు త్వ భూమిలో ప్రయివేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారని తెలియజేయకపోతే అధికారులు ఎలా చర్యలు తీసుకోగలరని ప్రశ్నించింది. భూమి సర్వే నెంబర్ లేకుండా వినతిపత్రం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముటుందని ప్రశ్నించింది. సర్వే నెంబర్లతో సమగ్ర వివరాలతో సంబంధిత ఆఫీసర్లు కు తాజాగా వినతి సమర్పించాలని ఎమ్మేల్యేలను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నెం 27లో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులకు కేటాయించడాన్ని సవాల్ చేశారు. అందులో 47 బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తున్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదంటూ జడ్చర్ల, మహబూబ్నగర్, మహబూబా బాద్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్రెడ్డి, యన్నం శ్రీనివాసరెడ్డి పిల్ దాఖలు చేశారు. ఎలాంటి వివరాల్లేకుండా అస్పష్టంగా వినతి పత్రం ఇస్తే, సంబంధిత అధికారులు చర్యలు ఎలా తీసుకోవాలని ప్రశ్నించింది. అస్పష్టమైన వినతి పత్రంపై అధికారులు చర్య తీసుకోకపోతే.. దానిపై వాళ్లకు తామెలా ఉత్తర్వులు ఇవ్వగలమని సందేహాన్ని లేవనెత్తింది. వివరాల్లేకుండా వినతి పత్రం ఇచ్చి చర్యలు తీసుకోకపోతే.. తాము ఎలా కల్పించుకోగలమని అడిగింది. వాదనలను విన్న ధర్మాసనం స్పష్టమైన వివరాలతో తాజాగా వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
వివరాల్లేకుండా వినతి పత్రమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES