- Advertisement -
- – జర్నలిస్టు భవనం నిర్మించేంతవరకు పోరాటం ఆగదు..
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేత..
– టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి.. - నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ జే ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రసంగించిన అనంతరం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ప్రత్యేక వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టులకు పక్కా భవనం లేక చెట్ల కింద ప్రైవేటు భవనాల కింద టీ స్టాల్ వద్ద హోటల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాన్ని 500 గజాల స్థలాన్ని కేటాయించి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉంటే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పక్క జనరల్ ఇంకా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైన సంగతి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు అధికారులు మర్చిపోవద్దన్నారు. అదేవిధంగా సూర్యాపేటలో ఉన్న అన్ని యూనియన్ల జర్నలిస్టులు అంతరంగిక సమస్యలన్నీ పక్కన పెట్టి జర్నలిస్టు భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -