నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లోని జీవావరణంలో అరుదైన కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’గా నామకరణం చేశారు. పాక్షిక పారదర్శక కనురెప్పలతో, విభిన్న చారలతో పామును పోలి ఉండే కొత్త జాతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తోందని, జీవవైవిధ్యానికి ప్రతీకగా ఈ పరిశోధన నిలుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు జడ్ఎస్ఐ చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్కతాలోని రెప్టిలియా విభాగం, లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేశారని జడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ ప్రకటనలో తెలిపారు.
శేషాచలంలో అరుదైన జీవి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES