Friday, June 20, 2025
E-PAPER
Homeసినిమామధ్య తరగతి కుటుంబాలకు ప్రతిబింబం

మధ్య తరగతి కుటుంబాలకు ప్రతిబింబం

- Advertisement -

సెవెన్‌ హిల్స్‌ బ్యానర్‌ పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ నిర్మాతగా నవీన్‌ కుమార్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సోలో బారు’. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ గౌతం కష్ణ హీరోగా, పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి కథానాయికలుగా నటించారు. పోసాని కష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్‌ చక్రపాణి, సూర్య, ల్యాబ్‌ శరత్‌, అరుణ్‌ కుమార్‌, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జులై 4వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా ఆపరేషన్‌ సింధూర్‌లో అమరుడైన తెలుగు జవాన్‌ మురళి నాయక్‌ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ జరిగింది. ఈ సందర్భంగా మురళి నాయక్‌ తల్లిదండ్రులు మాట్లాడుతూ, ‘మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు దూరమైనప్పటికీ గౌతమ్‌ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు. తను హీరోగా నటిస్తూ రాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు. దామోదర్‌ ప్రసాద్‌ , లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ ఫ్రేమ్‌ సుధాకర్‌, దర్శకుడు యాట సత్యనారాయణ, సంగీత దర్శకడు ఆర్‌.పి.పట్నాయక్‌ అతిథులుగా హాజరై చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ,’ ‘ఈ చిత్రం మధ్య తరగతి కుటుంబాలను ప్రతిబింబిస్తుంది. గౌతమ్‌ కష్ణ ఎంతో అద్భుతంగా నటించారు’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో హీరోగా నటించిన గౌతమ్‌ కష్ణ రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోకుండా అలాగే సినిమాకు డబ్బులు తక్కువ అయిన సమయంలో తాను కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టి సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాడు’ అని నిర్మాత సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ చెప్పారు. ‘ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సమవర్తి అనే ట్రస్టు ద్వారా నాకు వచ్చే ప్రతి సంపాదనలోనూ సగం ఆ ట్రస్టుకు అందజేస్తాను. అలాగే బిగ్‌ బాస్‌ ద్వారా వచ్చిన డబ్బులో సగం ఆ ట్రస్టు ద్వారా ఒక లక్ష రూపాయలు మురళి నాయక్‌ కుటుంబానికి ఇస్తున్నాను’ అని హీరో గౌతమ్‌ కష్ణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -