నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ప్రజాసంఘాల అద్వర్యం లో ఘనంగా తెలంగాణ మలిదశ ఉద్యమ గానకోకిల బెల్లి లలితక్క 26వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం లో తన ఆట పాటలతో తెలంగాణ భావజాలన్నీ ఊరురా వ్యాప్తి చేసి ప్రజలని చైతన్య పరచి, తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాలు అర్పించి లేడి గద్దర్ గా తెలంగాణ గాన కోకిలగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన బెల్లి లలితక్కని స్మరించుకున్నాము. ఆమె ఆట, పాట, పోరాటం, త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే రాష్ట్రంలో గుట్కా సారా నిషేధించాలని అప్పుడే ఆ ఆత్మ శాంతి చేకూర్చాలనీ ఉందని అన్నారు.
భువనగిరి జిల్లా కేంద్రంలో, హైదరాబాదులోని ట్యాంక్ బండిపై విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లలితక్క కుమారుడు సూర్య ప్రకాష్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, బీసీ జనసైతన్య రాష్ట్ర అధ్యక్షులు రాజారామ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు, జడ్పిటిసి బీరు మల్లయ్య, మలై సింగ్ యాదవ్ యూత్ బి గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు, వలిగొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపురి కవిత, మేక లలిత,తంగలపల్లి రవి, బెల్లి చంద్రశేఖర్,ప్రమోద్, బట్టు రాంచంద్రయ్య,కిరణ్, వాసు కే యాదవ్, వెన్నెల, బత్తుల సిదేశ్వర్, బోనగిరి శ్రీనివాస్,పుట్ట వీరేష్, గుండెబోయిన సురేష్,నక్కల చిరంజీవి, మహేష్ యాదవ్, పవన్,అయోధ్య రచ్చ, శ్రీను అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ట్యాంక్ బండ్ పై బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES