రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీని మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మించారు. పవన్ ప్రభ దర్శకుడు. అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఇదొక గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా. నేను ఎంతో సంతప్తిగా ఫీల్ అయిన చిత్రమిది. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా, తెలుగు వారిని ప్రతిబింబించేలా ఈ మూవీ ఉంటుంది. ఇప్పటికీ నా కోసం ‘షష్టిపూర్తి’ లాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ‘షష్టిపూర్తి’కి అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు.
ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు. నేను, అర్చన కలిసి ‘లేడీస్ టైలర్’ చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మూవీని చేశాను. ఇళయరాజా మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని ఇళయరాజా కూడా షాక్ అయ్యారు. ఈ సినిమా కోసం ఇళయరాజా అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం కామెడీ బాగా తగ్గింది. కామెడీ ప్రధాన సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం 11 సినిమాలు చేస్తున్నాఉ. మరో 4 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ప్రతి ఇంట్లో జరిగే కథ..
- Advertisement -
- Advertisement -