- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాలు విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కీలక మార్పు చేసింది. యూసఫ్ స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ని ఆ పార్టీ ఎంపిక చేసింది.
- Advertisement -