- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాలు తగ్గించేందుకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS)ను కేంద్రం తప్పనిసరి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాలని భావిస్తోంది. 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన టూవీలర్లకే ఏబీఎస్ అమలవుతోంది. ఇకపై ఎంట్రీ లెవల్ మోడళ్లు సహా అన్ని టూవీలర్లకూ దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల టూవీలర్కు రూ.5 వేల వరకు ధరలు పెరగనున్నాయి.
- Advertisement -