Wednesday, June 18, 2025
E-PAPER
Homeజాతీయంప్రమాద క్లయిమ్స్‌ నాలుగు వేల కోట్ల పైమాటే

ప్రమాద క్లయిమ్స్‌ నాలుగు వేల కోట్ల పైమాటే

- Advertisement -

– విమానం ఖరీదుకు రెండున్నర రెట్లు అధికం
న్యూఢిల్లీ:
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించిన పరిహార క్లయిమ్స్‌ భారీగానే ఉన్నాయి. ఇవి 475 మిలియన్‌ డాలర్ల మేర ఉండవచ్చునని అంచనా. రూపాయలలో చూసుకుంటే నాలుగు వేల కోట్లకు పైమాటే. అంటే విమాన ఖరీదుకు రెండున్నర రెట్లు అన్నమాట. ప్రమాదానికి గురైన విమానానికి 125 మిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని, ప్రయాణికులకు, థర్డ్‌ పార్టీకి చేయాల్సిన చెల్లింపులు, ఇతరత్రా వ్యయం కలిపి 350 మిలియన్‌ డాలర్లు అవుతుందని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామస్వామి నారాయణన్‌ తెలిపారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రత్యక్షంగా బీమా అందించకపోయినప్పటికీ రీ-ఇన్సూరెన్స్‌ ద్వారా ఎయిర్‌ ఇండియా విమానాల ప్రమాదాలకు పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణికులు తీసుకునే ప్రమాద బీమా పాలసీలకు కూడా కంపెనీ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ప్రయాణికులు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుంటారు. అనేక భారతీయ క్రెడిట్‌ కార్డులు రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ విమాన ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -