– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డుగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, మృతుని భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను ఆయన అందచేశారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులకు కోటిరూపాయల ప్రమాద బీమా అందించడం సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ఇంత గొప్పగా ఆలోచించలేదన్నారు. ప్రభుత్వ మానవీయ దృక్పధానికి, కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తొలుత సింగరేణిలో ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామనీ, ఇప్పుడు విద్యుత్ సంస్థల్లో అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీఎన్పీడీసీఎల్ సీఎమ్డీ వరుణ్రెడ్డి, విద్యుత్ శాఖ, యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES