నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియన్ హౌస్’ షూటింగ్లో నిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సినిమాకోసం ఒక కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సముద్రపు నేపథ్యాన్ని సృష్టించేందుకు ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్ను నిర్మించింది. నిన్న ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలయ్యాయని, మరికొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
నిఖిల్ సినిమా సెట్లో ప్రమాదం.. పలువురికి గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES