Tuesday, June 17, 2025
E-PAPER
Homeహైదరాబాద్పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

- Advertisement -

బాధితురాలికి రూ.8 లక్షలు నష్టపరిహారం…
నవతెలంగాణ -హయత్‌ నగర్‌
ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ ద్వారా ఫోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు బాలాపూర్‌ పోలీసులు తెలిపారు. 2018లో బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండో వివాహం చేసుకున్న నిందితుడు ఫయాజ్‌ అహ్మద్‌ అతని రెండో భార్య కూతురుపై లైంగికదాడి చేయడంతోపాటు పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేస్తే చంపుతానని బెదిరించాడు. దాంతో బాలిక తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ మేరకు సోమ వారం నిందితుడికి కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించిందని, అలాగే బాధితురాలికి రూ. 8లక్షల నష్ట పరిహారం అందించినట్టు బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -