- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఏ డి ఏ అపర్ణ విత్తనాల షాపు యజమానులకు తెలిపారు. శుక్రవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని విత్తనాల షాపులలో విత్తనాలు, రికార్డులు తనిఖీ చేశారు. నాసిరకం విత్తనాలు విక్రయించవద్దని, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై దత్తాద్రి గౌడ్, కామారెడ్డి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, తదితరులు ఉన్నారు.
- Advertisement -