- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మసాగర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎరువుల గోదామని ఏడిఏ హనుమకొండ, వ్యవసాయ అధికారి ధర్మసాగర్ పరిశీలించారు. అనంతరం రైతు వేదికల ధర్మసాగర్ లో ఇస్తున్న పర్మిట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మనకు అవసరమైనన్ని నిల్వలు తెప్పిస్తామని తెలిపారు. వరిలో రెండవ దఫా గుళికల యూరియా బదులుగా నానో యూరియా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలిపారు.
- Advertisement -