- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో దుంపల్లిగూడెం గ్రామల్లో ఉన్న చౌకదారుల దుకాణలును గురువారం మహేందర్ జి, అడిషనల్ కలెక్టర్ ములుగు, శ్రీ సయ్యద్ ఫైసల్ హుస్సేని, జిల్లా పౌరసరఫరాల అధికారి ములుగు, డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లై అదికారులు తనిఖీ చేసినారు. అనంతరం అధికారులు కార్డుదారులతో సంభాషించినారు మూడు నెలల బియ్యం పంపిణీలో ఏమైనా ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా చౌకధార దుకాణం వారికి, కార్డ్ దారులకు కూడా సూచించినది. మూడు నెలల బియ్యం ఒకేసారి అందుకోవడం కార్డుదారులు కూడా సంతోషం వ్యక్తం చేసినారు మరియు ఎలాంటి సమస్యలు లేవని తెలిపినారు.
- Advertisement -