No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంఏసీబీ వలలో ఏఈఈ

ఏసీబీ వలలో ఏఈఈ

- Advertisement -

– రూ.లక్షా 20వేల లంచం తీసుకుంటూ..
– కాప్రా మున్సిపల్‌ కార్యాలయంలో ఘటన
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రూ.లక్ష 20వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో (జీహెచ్‌ఎంసీ)లో జరిగింది. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా (ఏఈఈ)గా పని చేస్తున్న బి.స్వరూప.. ఓ కాంట్రాక్టర్‌ పూర్తి చేసిన పనులకు సంబంధించి మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎంబీ) ఎంట్రీలు జారీ చేయడానికి రూ.లక్ష 50వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ముందుగా రూ.లక్ష 20వేలు, తర్వాత మరో రూ.30వేలు ఇస్తానని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్‌ నుంచి ఏఈఈ రూ.లక్ష 20వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈఈని అదుపులోకి తీసుకున్న ఏసీబీ రంగారెడ్డి యూనిట్‌ బృందం కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఏఈఈని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఏసీబీ మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad