- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం (plane crash) జరిగింది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ వేస్తుంది.
- Advertisement -