- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
- Advertisement -