- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళ్తోంది. ఈ క్రమంలో టేక్ ఆఫ్ అయ్యే సమయంలో పక్షి ఫ్యాను రెక్కలకు తగిలింది. ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలెట్ అప్రమత్తమై చకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్ వేపై సేఫ్ లాండింగ్ చేశాడు. విమానంలో వందమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
- Advertisement -