Wednesday, June 18, 2025
E-PAPER
Homeజాతీయంసమస్యల్లో ఎయిర్‌ ఇండియా

సమస్యల్లో ఎయిర్‌ ఇండియా

- Advertisement -

– ఒక్క రోజే ఆరు సర్వీసులు రద్దు
– మరో రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు
– ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ముంబయి, కోల్‌కతా:
మూడున్నరేండ్ల క్రితం టాటా గ్రూపు కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ఇప్పుడు ఎయిర్‌ ఇండియా ఎదుర్కొంటోంది. వివిధ కారణాలతో పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం లండన్‌, పారిస్‌ నగరాలకు వెళ్ళాల్సిన ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు కాగా, శాన్‌ఫ్రాన్సిస్కో-ముంబయి విమానం స్టాప్‌ ఓవర్‌ సమయంలో ఒక లోపం కారణంగా ప్రయాణికులు విమానాన్ని దిగాల్సి వచ్చింది. ప్రయాణానికి ముందు జరిగే తనిఖీల్లో భాగంగా కొన్నిసమస్యలు కనుగొనడంతో ఢిల్లీ-పారిస్‌ విమానాన్ని రద్దు చేశారు. అలాగే అందుబాటులో మరో విమానం లేకపోవడంతో అహ్మదాబాద్‌-లండన్‌ విమాన సర్వీసునుకూడా రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి. మరో సంఘటనలో శాన్‌్‌ఫ్రాన్సిస్కో- ముంబయి విమానం మంగళవారం ఉదయం కోల్‌కతాలో స్టాప్‌ఓవర్‌ కోసం ఆగిన సమయంలో ఒక ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును నిలిపివేశారు. మొత్తంగా ఐదు సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో ఢిల్లీ-దుబారు, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-పారిస్‌, అహ్మదాబాద్‌ -లండన్‌, బెంగళూరు-లండన్‌, లండన్‌-అమృతసర్‌ సర్వీసులు వున్నాయని ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌ పేర్కొంది. వీటికి తోడుగా, ఢిల్లీకి రావాల్సిన ఎఐ 315 డ్రీమ్‌లైనర్‌ విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఆ పైలట్‌ హాంకాంగ్‌కు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీ-పారిస్‌సర్వీసు రద్దు చేసిన నేపథ్యంలో అందులోని ప్రయాణికులకు హోటల్‌ వసతి కల్పించినట్లు ఎయిర్స్‌లైన్స్‌ తెలిపింది. ప్రయాణికులు ఒకవేళ తమ టిక్కెట్‌ను కేన్సిల్‌ చేసుకుంటే పూర్తిగా రీఫండ్‌ ఇస్తామని, లేదా రీ షెడ్యూలింగ్‌ చేస్తామని తెలిపింది. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అహ్మదాబాద్‌- లండన్‌ విమాన సర్వీసును సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయలేదని, అందుబాటులో మరో విమానం లేనందునే చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -