నవతెలంగాణ-హైదరాబాద్: దిల్లీ- వాషింగ్టన్ డీసీ మధ్య విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని, ఆపరేషనల్ సంబంధిత పరిమితుల దృష్ట్యా ఈ రూట్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 26 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలకు రెట్రోఫిట్ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, పాకిస్థాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. విమానాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత నెలలోనే బోయింగ్ 787-8 విమానాలు రిట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డీసీకి లేదా అక్కడి నుంచి దిల్లీకి టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికుల్ని సంప్రదించి.. వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రిఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను సైతం అందిస్తామని తెలిపింది.
ఎయిరిండియా కీలక నిర్ణయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES