Friday, May 9, 2025
Homeజాతీయంమళ్లీ మోగిన సైరన్లు.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు

మళ్లీ మోగిన సైరన్లు.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిహద్దు జిల్లాలపై దాయాది వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్‌ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది.
అటు జమ్మూలోనూ నేటి ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్‌అవుట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -