– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – చండూరు : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకై ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం జడ్పిహెచ్ఎస్ లో ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించగా, గది ముందు భాగంలో ఉన్న వరండాకు సైతం గ్రిల్స్ పెట్టించి గదిలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ర్యాంప్ ,టాయిలెట్స్, రైలింగ్, తాగునీరు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని, అంతేకాక వారికి తగ్గట్టుగా కృత్యాధార పద్ధతిలో బోధన ఉండేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు రెండు, మూడు లారీలను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలు లేవని నిర్వాహకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీవో శ్రీదేవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఎంపీడీవో బండారు యాదగిరి , తాసిల్దార్ దశరథ,ఎంఈఓ కట్కూరి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పుష్పలత, మండల స్థాయి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES